చనిపోయిన NTV రిపోర్టర్ నంద్యాల శ్రీనివాస్ కుటుంబంకు జనసేన పార్టీ తరుపున ఆర్థిక సహాయం అందించిన రాయపూడి వేణుగోపాల్ రావు

                కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలం, NTV రిపోర్టర్ గా పనిచేస్తున్న నంద్యాల శ్రీనివాస్ కరోనాతో పోరాడి చనిపోయిన విషయం అందరికీ తెలిసినదే. సమాజంలో నాలుగోవ స్తంభంగా ఉన్న వ్యవస్థలో పనిచేస్తున్న మిత్రులు కరోనాకు బలి అవ్వటం చాలా బాధాకరం. ప్రజలకు, ప్రభుత్వంకు వారధిలాగా ఉంది అందరి కష్టాలు, బాధలు సమాజంకు తెలిపి న్యాయం చేస్తున్న ఈలాంటి మీడియా మిత్రులకు ఇలాంటి కష్టాలు వస్తే ఎలా ఆ కుటుంబం తట్టుకుంటుంది. పాలకులు, పత్రికా యజమానులు ఒక్క సారి మీడియా మిత్రులు బాధలు అర్ధం చేసుకోవాలని జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు గారు అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో జనసేన పార్టీ తరుపున 5000/ రూపాయలు ఆర్థిక సహాయం చేయ్యటం జరిగింది.  కోడూరులో శ్రీనివాస్ నివాసంకు వెళ్ళి శ్రీనివాసు రావు తల్లి వెంకటసుబ్బమ్మ, భార్య సరిత పిల్లలు నాగ వెంకట చైతన్య, చక్రదీప్ లతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  ప్రభుత్వం, నియోజకవర్గం ఎం‌ఎల్‌ఏ ఆదుకోవాలని కోరారు. ఆయన ప్రజలు అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  అవసరం అయితే బయటకు రావాలని మాస్కూలు, శానిటైజర్ వాడాలని కోరారు.