జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో గాయపడ్డ మహిళకు ఆర్థిక సాయం చేసిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

    పెనుకొండ, (జనస్వరం) : జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రమాదవశాత్తు గాయపడిన అనంతపురం జిల్లా, పెనుగొండ మండలం, 13వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన వీర మహిళ శ్రీదేవి గారిని పరామర్శించి, 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పెద్ద ఎత్తున విజయవంతం అయినప్పటికీ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని శ్రీదేవి అన్నారు. జనసేనపార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందువల్ల వైద్య బీమా కింద ₹. 50 వేల రూపాయలు వచ్చే విధంగా చూస్తామని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అనుకొని ప్రమాదాలు జరిగినప్పుడు జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, ఆర్థిక తోడ్పాటును అందించే విధంగా క్రియాశీలక సభ్యత్వమును ప్రవేశపెట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కాశెట్టి సంజీవ రాయుడు, సురేష్, సంయుక్త కార్యదర్శులు శివ, పెనుగొండ మండల అధ్యక్షుడు మహేష్, సోమందేపల్లె అధ్యక్షులు జబిబుల్ల వీర మహిళలు కాసెట్టి సావిత్రి, శిల్ప,తేజలక్ష్మి, శిరీష నాయకులు తోట ప్రకాష్, TN అంజి, కొండిశెట్టి ప్రవీణ్, లోకేష్, శివ శంకర్, విష్ణు, వెంకటేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way