Search
Close this search box.
Search
Close this search box.

రామతీర్థం దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి : బీజేపీ, జనసేన నాయకుల డిమాండ్

             రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహాన్ని ధ్వసం చేసిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ.. అలాగే రామతీర్థంలో జరిగిన జనసేన-బీజేపీ నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా బుధవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట జనసేన – బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తర్వాత అక్కడి నుండి గిరింపేటలో గల శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం వరకూ నిరసన పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికారప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, మీడియా ప్రతినిధి నిశిధా రాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాలి పుష్పలత, సుబ్రమణ్యం, యాదవ్, చిత్తూరుజిల్లా అధ్యక్షుడు మైందల రామచంద్రుడు, బీజేపీ నాయకులు పోతపాల రామమూర్తి, ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, ఓబీసీ మోర్చా అట్లూరి శ్రీనివాసులు, యువ మోర్చా వికోట శివ రాయల్, రామభధ్ర, తోటపాళ్యం వెంకటేష్, నక్కా రామచంద్ర, బ్రహ్మానందరెడ్డి కుమార్, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ పుంగనూరు నానబాల లోకేశ్వర (లోకేష్ రాయల్), పూతలపట్టు నియోజకవర్గ నాయకులు నరిగన్నగారి తులసీప్రసాద్ బిజెపి, జనసేన మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు, పలువురు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way