Search
Close this search box.
Search
Close this search box.

ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీల మోత తగ్గించాలని కదిరి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ

    కదిరి, (జనస్వరం) : పేద, మధ్య తరగతి ప్రజల మీద ఆర్టీసీ, విద్యుత్ చార్జీల భారం మోపుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ” బాదుడే బాదుడు” అంటూ కదిరి జనసేనపార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్లు భవనాలు అతిథి గృహం నుంచీ, ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, మద్య తరగతి రవాణా సాధనం ఆర్టీసీ బస్సు అని, ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెరగటం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, ఆ రోజు మన ముఖ్యమంత్రి మాది ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఈరోజు డీజల్ రేట్ పెరిగింది అని డీజల్ సెస్ పేరుతో ఆర్టీసి ఛార్జీలు పెంచడం న్యాయమా అని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం డీజిల్ సబ్సిడీని ప్రభుత్వమే భరించి ఆర్టీసి చార్జీలు తగ్గించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళతామని తెలియజేశారు. పాదయాత్రలో, ఓదార్పు యాత్రలో అలాగే ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ఈరోజు ఆస్తి పన్ను, చెత్త పన్ను, అలాగే నవరత్నలకు కూడా రకరకాల నిబంధనలు పెట్టి తూట్లు పొడుస్తూ ఎగ్గొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా మానుకోవాలని లేదంటే ప్రజావ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి రూరల్ మండల అధ్యక్షులు చిల్లా మహేష్, చలపతి, రవీంద్ర నాయక్, లక్ష్మీ ప్రసన్న, జిల్లా కార్య నిర్వహణా కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, రమణ, అనుప్రసాద్, కిన్నెర మహేష్, శేఖర్, నాగేంద్ర ప్రసాద్, రామనప్ప, నవీన్, దినేష్, ప్రసాద్, భాస్కర్, గణేశ్, మునెప్ప, నాగరాజు, గోవిందు, ఆంజనేయులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way