Search
Close this search box.
Search
Close this search box.

డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన రాజోలు జనసేనపార్టీ ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి

    రాజోలు, (జనస్వరం) : రాజోలు ఏనుగుపల్లి వారి వీధిలో చాలా కాలంగా పైపులైన్ పనులు పెండింగ్లో ఉండి ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. పంచాయతీలో ఎన్నిసార్లు చెప్పినా వాయిదా వేస్తూ వచ్చారు. దీనితో జనసేనపార్టీ నుండి రాజోలు ఎంపీటీసీగా ఎన్నికైన దార్ల కుమారి లక్ష్మి  మొట్టమొదటి మండల సమావేశంలో ఈ సమస్యపై గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అధికారులపై వత్తిడి తీసుకువచ్చి కావలసిన అనుమతులు మరియు నిధులు కేటాయించుకోవడం జరిగింది. ఈరోజు పైపులైన్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు ఎక్కడ ఉన్న పరిష్కరించేది ఒక్క జనసేనపార్టీ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way