Search
Close this search box.
Search
Close this search box.

గాయపడ్డ జనసైనికుడికి ఆర్థిక సాయం అందించిన రాజోలు జనసేన ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి

    రాజోలు, (జనస్వరం) : రాజోలు నియోజకవర్గం, బట్టేలంక గ్రామానికి చెందిన బోనం రాజేష్ అనే జనసైనికుడు మొన్న ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పడి తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో అతనికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో జనసేనపార్టీ రాజోలు జనసేన ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి వైద్య ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. ఈ మొత్తాన్ని రాజోలు జనసేన పార్టీ పెద్దలు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దిరిశాల బాలాజీ, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను, మల్కిపురం ఎంపీపీ సత్యవాణి గారి చేతుల మీదుగా అతని కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way