Search
Close this search box.
Search
Close this search box.

రహదారుల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చిన రాజంపేట జనసేన నాయకులు

రాజంపేట

   రాజంపేట, (జనస్వరం) :  రాజంపేట నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని రాజంపేట జనసేన నాయకులు కొట్టే. రాజేష్ గారు వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రములో రోడ్లు పాడైపోయాయని మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తితే, అవి సరి చూసుకోవలసింది పోయి ప్రతి విమర్శలు చేయడం  సిగ్గుచేటు అని అన్నారు.  సిధ్ధవటం దగ్గర నుండి వీరబల్లి వరకు ఎక్కడ చూసిన గుంతలే ఉన్నాయి.ఈ గుంతలు కూడా పూడ్చలేరా ? ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలి. ఉపాధి లేక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. టీడీపీలో ఎమ్మెల్యేగా వున్నప్పుడు ఆల్వెన్ స్థానంలో ఒక పరిశ్రమకు శంఖుస్థాపన చేశారు. మరి అది ఏమైంది. సొంత మండలంలోనే రోడ్లు చూస్తే అధ్వాన్నంగా వున్నాయి. పంచాయతీకి కేంద్రం ఇస్తున్న నిధులు ఏమైనట్టు అని ప్రశ్నించారు. జనసేన పార్టీ మీలాగా రాజకీయం చేయదు. ప్రజల బాగోగులు కోసం వచ్చిన పార్టీ మా జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే ముందు ఒక్క సారి మీ మనసాక్షిని  ప్రశ్నించుకోండి. ఇప్పటికైన రాజకీయాలు మాని రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెట్టండి  అని,  రాజంపేట అభివృద్దికి జనసేన పార్టీ  సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way