Date of Publish : 25 June 2021, 4:28 pm
Editor : Sake Naresh
ఆయుర్వేద వైద్యులను అభినందించిన రాజంపేట జనసేన నాయకులు రామ శ్రీనివాసులు

రాజంపేటనియోజకవర్గంలోని సుండుపల్లి మండలంలో ఆయుర్వేద వైద్యులు నాగేశ్వరరావు, రమణ, నాగలేసులు చేపట్టిన ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు రామశ్రీనివాసులు గారు మాట్లాడుతూ పూర్వకాలంలో ఆయుర్వేదిక్ మందులు ఎంతో విలువైనవని ఈ మందులను మన పూర్వీకులు వాడేవారని ఆకులు, అలములు తో వైద్యం చేసే వారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో యువకులు ఆయుర్వేద వైద్యం చెయ్యడం చాలా మంచిదని ఆయుర్వేద మందులు వాడాలని వారు పేర్కొన్నారు. అనంతరం ఇమ్యూనిటీ బూస్టర్ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
All Rights Reserved By Janaswaram News.