Search
Close this search box.
Search
Close this search box.

వరద బాధితుల సమస్యలను పరిష్కరించాలని RDO గారికి వినతిపత్రం అందజేసిన రాజంపేట జనసేన నాయకులు

      రాజంపేట, (జనస్వరం) : అన్నమయ్య వరద బాధితుల సమస్యల పరిష్కారంలో భాగంగా RDO కొందండరామిరెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు జనసేన నాయకులు చెంగారి శివ ప్రసాద్ తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్ట్ క్రింద వరదల కారణంగా రాజంపేట మండలం మందపల్లి, పులపుత్తూరు, వడ్డెపల్లి, తోగురుపేట, రామచంద్రపురం, గుండ్లూరు, రాచపల్లి తదితర గ్రామాలు గతంలో నష్టపోయాయి. సదరు గ్రామ ప్రజలు ఇండ్లు కూలిపోయి, ఆస్తి నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టాన్ని భరించవలసి వచ్చింది. సదరు గ్రామ పొలాల్లో 5 నుండి 7 అడుగులు ఇసుక మేటలు పేరుకుపోయి పంటలు పందించుకొనుటకు వీలు లేకుండా పోయింది.సదరు గ్రామస్థులు సరైన నష్టపోయిన పరిహారాన్ని అందుకోలేదు. వారికి ఎటువంటి నివాస గృహాలు నిర్మించలేదు. అలాగే వారికి మెరుగైన వైద్య సదుపాయలు అందించి ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరడమైనది. అదే విధంగా పొలాల్లో పూడిపోయిన బోర్లను కూడా సరి చేయలేదు. మునకకి గురైన గ్రామ నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశం కల్పించవలసిందిగా కోరడమైనది. సదరు గ్రామల రహదారుల ఏర్పాటు చేయవలెను. మరి ముఖ్యంగా ఉచిత త్రాగు నీటి సౌకర్యం కల్పించవలసిందిగా కోరడమైనది జనసేన నాయకులు చెంగారి శివ ప్రసాద్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షైక్ అబ్దుల్ లతీఫ్, లీగల్ సెల్ కత్తి సుబ్బారాయుడు, అజయ్ వేల్పుల, మారన్, మస్తాన్ రాయల్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way