ఏలూరు, మార్చి 30 (జనస్వరం) : రాజమండ్రి బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ప్రముఖ సీనియర్ న్యాయవాది సిపిఆర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయనకు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారి కే. మల్లేశ్వరరావు అందజేశారు..ఈ సందర్భంగా ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్నేహితులు కలిసి జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సిపిఆర్ రెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్, కడియాల శ్రీచరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.