పదవి విరమణ వయోపరిమితి పెంపుదల మీ రాజకీయ లబ్ధి కోసమే : ఆమదాలవలస జనసేన నాయకులు పేడాడ.రామ్మోహన్

   ఆమదాలవలస, (జనస్వరం) : ఉద్యోగుల పదవీ విరమణ పెంచడం పై శ్రీకాకుళం జిల్లాలో AIYF ఆధ్వర్యంలో CPI కార్యాలయం నందు జిల్లా కార్యదర్శి లోకనాథ్ అధ్యక్షతలో ఉద్యోగ సంఘాల అఖిలపక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా AIYF రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు మరియు జనసేన నాయకులు ఆమదాలవలస నియోజకవర్గ ఇంఛార్జ్ పేడాడ. రామ్మోహన్ రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సి అడిగితే పదవీ విరమణ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచుతాం అనడం సరికాదని ఈ నిర్ణయం వల్ల వేలాది మంది నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది తప్పా! ఆచరణలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు కూడా నమ్మించి మోసం చేశారని మాట తప్పను మడమ తిప్పను అంటూనే సచివాలయ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని సచివాలయం ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్, ఎస్ ఎఫ్ ఐ నాయకుడు హరీష్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రవి రాధాకృష్ణ లతోపాటు విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way