
రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలో ఆచంట పద్మావతి అనే 22 సంవత్సరాల అమ్మాయి కీళ్ల వాతంతో బాధపడుతున్న విషయాన్ని కువైట్ లో ఉన్నటువంటి కడప రైల్వేకోడూరుకు చెందిన గుంటూరు శంకర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అతను వెంటనే స్పందించి ఈ రోజున అతని పుట్టినరోజు సందర్భంగా పదివేల రూపాయలు ఆ కుటుంబానికి జనసేన గల్ఫ్ కార్మికులు గ్రూపు సభ్యులు మునెయ్య గంటా రామకృష్ణ, సూర్యారావు, గుబ్బలప్రసాద్, నాగ చందూల సహాయసహకారాలతో మండేల బాబి నాయుడు గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేశవదాసుపాలెం గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ మరియు జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మరియు గ్రామస్తులు అందరూ కూడా గుంటూరు శంకర్ గారు అందించిన సహాయానికి గుంటూరు శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా గుంటూరు శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.