పశ్చిమగోదావరి జిల్లా జనసేన నాయకుల సహకారంతో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రైల్వే కోడూరు జనసేన నాయకులు

   రైల్వే కోడూరు, (జనస్వరం) : కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో ఇల్లు, సర్వం కొట్టుకుపోయిన సామాన్య ప్రజానీకానికి జనసేన పార్టీ రైల్వేకోడూరు జనసైనికులు పశ్చిమ గోదావరి జిల్లా జనసైనికులు సరఫరా చేసిన నిత్యావసర సరుకులను 30 పేద కుటుంబ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర మరియు దినకర్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత , దేశ తొలి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలబడటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిత్యావసరాలు సరఫరా చేసిన తర్వాత జనసైనికులు బైక్ ర్యాలీ గా వెళ్లి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర, రైల్వేకోడూరు జనసైనికులు గంధం శెట్టి దినకర్ బాబు, ముత్యాల కిషోర్, ఎద్దల అనంత రాయలు, పటం రవి, కటికo మణి, పగడాల వెంకటేష్, ప్రసాద్, సుబ్బరామయ్య, మాదం సుబ్రహ్మణ్యం, శంకరయ్య, మహేష్, ఉత్తరాది శివ, శివ, నల్లo శెట్టి కిషోర్, చవాకుల రెడ్డి మనీ స్థానిక జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way