Search
Close this search box.
Search
Close this search box.

గిద్దలూరు బండ్ల వెంగయ్య నాయుడు కు సంతాపం తెలియజేసిన రైల్వే కోడూరు జనసైనికులు

                    ప్రకాశం జిల్లా గిద్దలూరు జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు మరణానికి రైల్వే కోడూరు జనసేన పార్టీ తీవ్ర సంతాపం తెలియజేస్తున్నదని జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు తెలిపారు.. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన పాపానికి అవమానించి చనిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బండ్ల వెంగయ్యనాయుడు మరణానికి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది ఓ రకమైన రాజకీయ హత్య గా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలుతో మాట్లాడే విధానం వైసిపి ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసుకుంటే మంచిదన్నారు. డబ్బు పెట్టి గెలిచిన వాళ్ళు ప్రజాసేవ ఇలాగే చేస్తారని ప్రజలు తెలుసుకోవాలన్నారు. మనపై మనం నమ్మకం ఉంటేనే బలమైన రాజకీయం చేయాలని జన సైనికులకు హితవుపలికారు. ఈ కార్యక్రమంలో అనంత రాయలు, ప్రసాదు, శివ , మణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way