Logo
Date of Publish : 30 November 2025, 11:15 pm
Editor : Sake Naresh

అచ్చెన్నాయుడు గారిని కలసిన పుట్టపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శివప్రసాద్

విజయవాడ, నవంబర్ 30, (జనస్వరం) : విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు మార్కెట్ యార్డులలో నెలకొన్న సమస్యల గురించి వివరించారు. యార్డుల నిర్వహణ, మౌలిక సదుపాయాల లోపాలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రికి అవగాహన కల్పించారు. ఇటీవల జరిగిన మార్కెట్ కమిటీ సమావేశంలో మార్కెట్ అభివృద్ధి పనులపై తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ సంబంధిత రిజల్యూషన్ పత్రాలను మంత్రికి అందజేశారు. మార్కెట్ యార్డుల అభివృద్ధికి అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు వీలైనంత త్వరగా మార్కెటింగ్ కమిషనర్‌తో చర్చించి అవసరమైన అనుమతులు విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేశారంటూ వ్యాఖ్యానించారు. రైతుల అనుసంధాన కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీలను మరింత బలపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో పుట్టపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్, జనసేన నాయకులు ముత్యాల కరుణాకర్, నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com