Search
Close this search box.
Search
Close this search box.

ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి :- ఎమ్మిగనూరు ఇంఛార్జ్ రేఖగౌడ్

– రాయలసీమ తిరుపతిలో జనవాణి 

      ఎమ్మిగనూరు, (జనస్వరం) : రాయలసీమలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు 21 వ తేదీన ఆదివారం రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించే జనవాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర మహిళ సాధికారిక ఛైర్మన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ పిలుపునిచ్చారు. సామాన్యుడి గళం ప్రభుత్వానికి వినిపించేలా రాయలసీమ జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జనవాణి కార్యక్రమంలో పాల్గొని నేరుగా జనసేనపార్టీ అధినేతకు ఇస్తే ప్రజల వద్ద నుంచి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడానికి జనసేన పార్టీ తరపున ప్రత్యేక యంత్రంగం కృషిచేస్తుందని తెలిపారు. ప్రజలు ఈ నెల 21 వతేది ఉదయం 10 గంటల లోపు జి.ఆర్.ఆర్ కన్వెన్షన్ హల్ తిరుపతి నందు హాజరై కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way