Search
Close this search box.
Search
Close this search box.

కనకమయ్య పేట గ్రామములో త్రాగునీటి సదుపాయం కల్పించండి : ఆమదాలవలస జనసేన నాయకులు

     ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) కార్యకర్తల ఆధ్వర్యంలో కొణిదెలు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 26వ రోజు సరుబుజ్జిలి మండలం, కనకమయ్య పేట గ్రామములో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రధాన సమస్య త్రాగు నీరు సదుపాయం లేక పక్క ఊరు నుంచి తెచ్చుకుని తాగే దౌర్భాగ్య పరిస్థితిలో గ్రామ ప్రజలందరూ ఉన్నారుని, ఈ ఒక్క సమస్య వాళ్లకి తీర్చగలిగితే చాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు జనసేన పోరాటం చేస్తుందని గ్రామ ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది. అలాగే ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలని, యువత అందరకి కూడా జాబులు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీని ఆదరించి గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు సైరుగాపు సంతోష నాయుడు, జగదీష్, మామిడి సాయి, కిరణ్, కోమల్, మోహన్, ప్రదీప్, జనసేన కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way