ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంపు ఆదేశాలను ఉపసంహరించుకోవాలి : గూడూరు నియోజకవర్గ జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్

ఆస్తి పన్ను

           ప్రజల పైన సేవా రుసుముల భారం మోపకుండా ఆస్తి పన్ను మరియు చెత్త పన్ను పెంపు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని జనసేన నాయకులు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గూడూరు పురపాలక కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వహక కమిటీ సభ్యులు తీగల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ అసలే కరోనా కష్ట కాలంలో పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో చెత్త పైన సేవా రుసుముల వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడు కార్యక్రమానికి పూనుకోవడం తగదన్నారు. ఇప్పటికే ఆస్తి పన్ను పెంపు పైన పేద, అణగారిన వర్గాలు మరియు మధ్యతరగతి ప్రజలు ఆందోళన పడుతుంటే కొత్తగా కేవలం చెత్త పైన ప్రతి ఇంటి నుంచి నెలకు 90/- రూపాయల, సంవత్సరానికి 1080/- మరియు షాపులు నుండి నెలకు 120/- పైన వసూలు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్ను ఆదేశాలు ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఉద్యమం తప్పదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అలివేలు రాజశేఖర్, మల్లి ధనుంజయ సనత్, మోహన్, ఉప్పు సాయి, చెన్నపట్నం కోటి, పొలిపాటి గోపి, కొమ్మూజీ సూరజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way