కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్

     కరోన బాధితులకు సరైన వైద్యం అందించడం లేదని తన దృష్టికి రావడంతో పొగతోటలోని ఎయిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడుతున్న జనసేన పార్టీ నెల్లూరు జిల్లా మైనార్టి నాయకులు షానవాజ్ గారు. కరోన కష్ట, కాలంలో రోగులకు మంచి వైద్యం అందించాల్సి ఉంది పోయి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. డాక్టర్లు ప్రజలకు మంచి వైద్యం అందించడం విఫలమయ్యారన్నారు. దీంతో అమౌయకులైన పేద ప్రజలు బలవుతున్నారు అన్నారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులోని డాక్టర్లు కొందరు మాత్రం ప్రజలకు సేవ చేయడంలో అంకితమయ్యారని అన్నారు. అలాంటే డాక్టర్లకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి జేబులు నింపుకుంటున్నా పొగతోటలోని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయన వెంట స్థానిక జనసైనికులు ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి :

హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here