Search
Close this search box.
Search
Close this search box.

ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం అందజేసిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు

   దర్శి, (జనస్వరం) : దర్శి నియోజకవర్గంలోని వెంకటాచలంపల్లి గ్రామం సమీపంలో చందలూరు కొండమీద నిర్మిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మాణానికి గాను ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది వరికూటి నాగరాజు 1,00,000/- విరాళాన్ని ప్రకటించి, వెనువెంటనే 25,000/- రూపాయలను గుడి నిర్మాణ కార్యనిర్వాహకులు సత్యంకి అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వరికూటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ డిప్యూటీ డి.ఈ.ఓ బద్దుల లక్ష్మయ్య, గడ్డిపాటి వేణుగోపాల్, పాలడుగు నాగేశ్వరరావు, షేక్. ఇర్షాద్, జడల వెంకటేశ్వర్లు, ఓబులాపురం కొండా, నీలిశెట్టి ప్రభు, పుప్పాల నరేంద్ర, పుప్పాల వెంకట రామయ్య, మారెడ్డి పవన్, శివ పాల్గొనడం జరిగినది. గుడి నిర్మాణానికి వారి వంతుగా విరాళాన్ని అందించినటువంటి వరికూటి నాగరాజుకి గుడి నిర్మాణ కార్య నిర్వాహకులు కృతజ్ఞతలు తెలపడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way