అనంతపురం, అక్టోబర్ 20, (జనస్వరం) : రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అనంతపురం రూరల్ మండల ప్రజల సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం కోసం శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ రేపు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బుడ్డప్ప నగర్ సమీపంలోని సెరికల్చర్ కార్యాలయం వెనుక వైపున ఉన్న ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, అవసరమైన అన్ని వివరాలను జతచేసి హాజరు కావాలని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.