Search
Close this search box.
Search
Close this search box.

32 గ్రామ పంచాయతీలో జనసేనపార్టీ బలోపేతానికి ప్రణాళిక : యుగంధర్ పొన్న

జనసేనపార్టీ

               చిత్తూరు ( జనస్వరం ) : కార్వేటినగరం మండల కేంద్రంలో గంగాధర నెల్లూరు మండలంలోని జనసైనికులు ఇంచార్జ్ యుగంధర్ పొన్నను కలిశారు. ఈ సందర్భంగా Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ వచ్చే రోజుల్లో గ్రామీణ ప్రజలకు అండగా నిలబడేది యువతేనని ఉద్భోదించారు. గ౦గాధర నెల్లూరులో పార్టీని అంతర్గతంగా అభివృద్ధి చేసి, రాజకీయ ప్రక్షాళనకు నాంది పలకాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు. ముప్పై రెండు గ్రామ పంచాయతీలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ పిలువునిచ్చారు. ప్రణాళికా బద్దంగా పనిచేయాలని, క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. రాజకీయంలో సహనం ఓర్పు అత్యవసరమని తెలియజేసారు. మండల ప్రజల కోసం, వారి సమస్యల్లో అండగా నిలబడడం కోసం మేము త్యాగం చేయడానికైనా సిద్దమేనని జనసైనికులు తెలపడం గమనార్హం. భవిష్యత్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా Dr యుగంధర్ పొన్నను దుశ్శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, గంగాధర నెల్లూరు మండల నాయకులు రాజేష్, రాజేష్, దేవా జనసైనికులు అరుణ్, సుధీర్, రఘు, ఉదయ్, రూబన్, అజిత్ కుమార్, తరుణ్, పూర్ణ, అపీల్ కుమార్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way