జనసేన నాయకులు జనసైనికుల పై జరుగుతున్న వారి దాడులపై చర్యలు తీసుకోవాలన్న పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

                తూర్పుగోదావరి రాజనగరం నియోజవర్గం గానుగూడెం గ్రామంలో జనసేన నాయకులు కార్యకర్తల మీద దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు కోరారు. ఈ పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాయడమే తప్ప వారి విధులను సక్రమంగా వారు నిర్వర్తిస్తే ఇలాంటి దారుణాలు జరిగే అవకాశమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న కాకినాడ రూరల్ కరపలో మా జనసైనికులు 6గురిపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కి పంపారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాన్య ప్రజలు వెళ్లి కేసు పెడితే ఆ కేసును దర్యాప్తు చేయకుండా వైసీపీ నాయకులకే కొమ్ము కాస్తున్నారు. గానుగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సత్య శ్రీ ఆమె భర్త రంగా పైన వారి వెంట ఉన్న జనసేన శ్రేణులపైన ఎన్నికలలో గెలిచిన అప్పటినుంచి అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉన్నతాధికారులు ఈ ఘటనపై సత్వరమే విచారణ చేపట్టాలని అధికారపార్టీ నేతల అండతో జనసేన నాయకులు శ్రేణులపై హింసకు పాల్పడ్డవారిని అరెస్ట్ చేసి తగిన చర్యలు చేపట్టాలని అని అన్నారు.