గొల్లప్రోలు ఇ బి సి కాలనీని సందర్శించిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి
గొల్లప్రోలులో ఈబిసి కాలనీని పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి సందర్శించారు. ఈ సందర్బంగా శేషుకుమారి మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా సుద్ద కాలవ నుండి వస్తున్న నీరు వల్ల ఇబిసి అంతా మునిగి పోయిందని తెలియజేసారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బందికరంగా జీవిస్తున్నారని, ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని తెలియజేసారు. గత 40 సంవత్సరాలనుండి కూడా ఇదే పరిస్థితి ఉందని పాలకులు వస్తున్నారు పోతున్నారు. కానీ, మాకు పరిష్కారం చేయలేదని ప్రజలు వాపోయారు అని తెలియజేసారు. గత ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని ఈ సందర్బంగా తెలియజేసారు. ఇప్పటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుద్ద కాల్వను ఆధునీకరణ చేసి గొల్లప్రోలు ఇబిసి కాలనీ వాసులకు పరిష్కారం చూపాలని ఈ సందర్బంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కష్టం ఉన్నచోట జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, సుబ్బు, రఘు, కార్యకర్తలు జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.