మత్స్యకార సమస్యలను తెలుసుకున్న పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

పిఠాపురం

            పిఠాపురం ( జనస్వరం ) : యు కొత్తపల్లి మండలంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కొత్తపట్నం గ్రామంలో పిఠాపురం జనసేన ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు పర్యటించి అక్కడి మత్స్యకార సమస్యలను తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ వారు ఎన్నో సంవత్సరముల నుండి ఎదుర్కొంటున్న సమస్య స్మశాన వాటిక లేకపోవడం అని తెలియజేశారు. స్మశాన వాటిక లేక ఉన్న కొద్దిపాటి తీరప్రాంత స్థలంలో ఎవరైనా చనిపోతే వారి భౌతికకాయాన్ని పూడ్చిన తరువాత తుఫానుల అలల తాకిడికి మరల పైకి వస్తున్నాయి అని వాటిని మరలా పూడ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు. ఈ సమస్యపై స్పందించిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చూపుతానని వాళ్లకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టా శివ, దొడ్డి దుర్గాప్రసాద్, వనమాడి రాజు, పాత్ర అప్పలరాజు, సూరాల శ్రీను, పట్టా సూరిబాబు, వనమాడి ఎల్లారావు, పంత్ ఆడి ముసలయ్య, పాత్రి గంగాధర్, రేవు విశ్వనాథం, పాత్రి దుర్గాప్రసాద్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way