పిఠాపురం, (జనస్వరం) : యు. కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో ఇటీవల బైక్ ఆక్సిడెంట్ లో యువకుడు దడాల లక్ష్మణ్ మరణించారు. ఆ లక్ష్మణ్ మీద బెంగ పెట్టుకుని వారి అన్నయ్య జన సైనికుడు దడాల ప్రత్యూష్ కి గుండె నొప్పి రావడంతో ఆపరేషన్ అయింది. ఈ విషయం తెలుసుకున్న పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి గారు పాత ఇసుకపల్లి గ్రామంకి వెళ్లి ప్రత్యూష్ ని, అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ జనసేన కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన జనసేన పార్టీ తోడుగా ఉంటుందని అన్నారు. అలాగే ఎప్పుడు ఆపద వచ్చిన మీ ఆడపడుచుల అండగా ఉంటానని రెండు వారం రోజుల్లో మళ్లీ వస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, కోన రామకృష్ణ, దాసరి దేవదాసు, దడాల బాబి, దడాల సన్నీ, అనపర్తి విజయ్ కుమార్, కుంచె రంగ, రేవాడ కామేష్, పిరటి బాల ప్రసాద్, నున్న నాని, ఏనుగుపల్లి తేజ, రావాడ కిరణ్, దడాల రాము, కిరణ్, ఇసుకపల్లి జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
