రాజంపేటలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

పింగళి వెంకయ్య

          రాజంపేట ( జనస్వరం ) : భారత స్వాతంత్ర సమరయోధుడు ,మన జాతీయ జెండా రూపకర్త కీర్తిశేషులు శ్రీ పింగళి వెంకయ్య గారి 146 వ జయంతి సందర్భంగా ఈ రోజు రాయచోటి జనసేనపార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు,  షైక్ రియాజ్ నేతృత్వంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి  నివాళులు అర్పించారు. భారత దేశంలో ప్రతిఒక్కరూ ఆయన చేసిన సేవల పట్ల గుర్తెరగాలని పేర్కొన్నారు. అదేవిధంగా జనసేనపార్టీ నాయకులు రామశ్రీనివాస్ మాట్లాడుతూ “స్వాతంత్ర్య సమరయోధులు, సాహితీవేత్త, బహుభాషా కోవిదులు, భారత జాతీయ పతాకానికి రూపకల్పన చేసి మన తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆయన చివరికి తినడానికి ఆహారం లేకుండా చాలా రకాల సమస్యలు ఎదుర్కొని తుది శ్వాస విడిచారు. అటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాబోయే తరాల వారికి పునరావృతం కాకుండా అందరూ భావితరాల భవిష్యత్తు దేశం, సమాజం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన సేవలు త్యాగాలను గుర్తు చేసుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కొనియాడుతూ శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మౌలానా రషీద్ అహ్మద్ ఖాసిమ్, అరిఫ్, షాహిద్, వెంకటేష్, సుబ్బయ్య, హైదర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way