స్థానిక MRO కు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పత్తికొండ జనసేన నాయకుల వినతి పత్రం

                పత్తికొండ MRO గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు C రాజశేఖర్ గారు మరియు ఇతర జనసేన నాయకులు. ఆయన మాట్లాడుతూ పత్తికొండ పట్టణంలోని, కర్నూల్ రోడ్ లో ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ యందు కస్టమర్లకు ఆన్లైన్ బిల్లు ద్వారా తీసుకోవాల్సిన డబ్బులను అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన కస్టమర్లకు గ్యాస్ డెలివరీ సరిగ్గా ఇవ్వడం లేదు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు అధిక వసూలు చేయరాదని తెలియజేసినా  ఏజెన్సీ వారు మాత్రం నియమాలు గాలికి వదిలేసి అలాగే వసూలు చేస్తున్నారు. ఒక గ్యాస్ సిలిండర్ పై అత్యధికంగా 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై భారత్ గ్యాస్ ఏజెన్సీ యందు విచారణ చేసి అక్రమ వసూళ్లను అరికట్టాలని, ఎమ్మార్వో గారికి తెలియ చేసిన జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు ఇస్మాయిల్, నూర్ భాషా, తిమ్మప్ప, అనిల్, మరియు తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి :

మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here