మిరియాలు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి : అరకు జనసేన నాయకులు

    అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలం పేదలబుడు పంచాయతీ పరిధిలో గల గర్డగుడ గ్రామంలో సోమవారం ఉదయం జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, అల్లంగి రామకృష్ణ, L b. రవీంద్ర ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించడం జరిగింది. అలాగే ఇంటింటికి జనసేన మాటలు, సిద్ధాంతాలు తీసుకెళ్తు, గిరిజనులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. ముఖ్యంగా గిరిజనుల పండించిన మిరియాల పంటలకు  ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని జనసేన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజనులు పండించిన మిరియాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజనులతో నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way