Logo
Date of Publish : 16 March 2024, 8:11 pm
Editor : Sake Naresh

ప్రజాగళం సభకు తరలి రావాలి – జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్ రావు

      గూడూరు, (జనస్వరం) : వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డ అన్ని వర్గాల ప్రజలు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు కోరారు. గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట సమీపంలోని బోప్పూడి వద్ద జనసేన, బీజేపీ, టీడీపీల ఆధ్వర్యంలో జరిగే సభలో అన్ని వర్గాల ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజా వ్యతిరేకతను తెలియచేయడం జరుగుతుందని, ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది రాష్ట్ర భవితకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన మూడు పార్టీల కాంబినేషన్ 2024 ఎన్నికల్లో పునరావృతం కావడం ఖాయమన్నారు. ప్రజాగళం సభను విజయవంతం చేసేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పిఓసీ మోహన్, నాయకులు ఇంద్రవర్ధన్, అవినాష్, సనత్, రాజశేఖర్, పెంచలయ్య, మురళి, సాయి, శివ, వసంత్, శంకర్, సన్ని తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com