Search
Close this search box.
Search
Close this search box.

జగన్ పస్తులు పెట్టిన కార్మికుల కు ఆకలి తీర్చిన జనసైనికులు

   పిఠాపురం ( జనస్వరం ) : మున్సిపల్ కార్మికులు తమ హక్కలకై చేబట్టిన నిరవధిక సమ్మెకు జనసేన బాసటగా నిలిచింది. సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో ముత్యాల అప్పారావు ఆధ్యక్షతన జరుగుతూన్న సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతుగా రెండు రోలు క్రమం తప్పకుండా పి.ఎస్.ఎన్.మూర్తి అండ్. టిమ్ సమ్మె ప్రాంగణానికి వచ్చి ఉదయం టిపిన్ , మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పి. ఎస్.ఎన్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ఆప్కో స్ కార్మికుల కన్నీరు సెలఏరుగా పారుతున్నాయి.  రోడ్డెక్కి హక్కుల కోసం గగ్గోలు పెడుతున్నాడు కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.  ఈ కార్మికులకు పాదయాత్రలో హామి ఇచ్చి, ఆనాడు నవ్వించావు. పదవెక్కి ఆ హామీ అమలు చేయాలేక ఈ రోజుఏడిపిస్తున్నాడని అన్నారు. ఇది ఎంతో బాగుంది అనుకుటున్నావ్ జగన్ మోహన్ రెడ్డి మాకు మాత్రం చాలా బాదగా ఉంది సిగ్గు గాను ఉంది. కార్మికుల బాదను అర్థం చేసుకో అన్నిరకాల బటన్ నొక్కుతున్నావే మరి ఈ కార్మికులకు నొక్కడానికి ఏ బటను లేదా అని జనసేన అడుగుతుందీ. నవరత్నాలతో ఆగిపోయావే… ఎక్కడైనా ఒక పరిశ్రమ తెచ్చావా, కొత్త గా ఒక ఉద్యోగం కల్పించావా… ఉన్నా ఊద్యోగాలకు జీతాలు ఇవ్వలేక పోతున్నావ్ అని విమర్శించారు. నీఉద్దేశం ఇది ప్రజాసామ్యం అనుకుంటున్నావా ? పాదయాత్రలో జీతాలు పెంచుతాన్నావు పెంచు, పర్మినెంట్ చేత్తానన్నావు ఆశగా ఎదురు చూస్తున్నారు.  వారి సమస్యలు పరిష్కరించక పోతే మా నాయకులు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ జనసేన పార్టీ మద్దతుగా ఉంటాం. ఖచ్చితంగా వారి తరుపున పోరాడతామని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పిండి శ్రీను, బీసీ నాయకులు మల్లం శ్రీనివాస్, కర్రీ కాశీ, పెంకే జగదీష్ , ముప్పన రత్నం, మిరియాల చిట్టి, కర్రెడ్ల రాజు, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way