కరోనా విపత్కర సమయంలో ప్రజల ఆర్తనాదాలు వినిపించలేదా : జనసేన నాయకులు కృష్ణయ్య

               ఆంధ్రప్రదేశ్ లోని  కరోనా బాధితులు చాలా కష్టాలు అనుభవిస్తున్న మధ్యతరగతి ఆర్తనాదాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి వినిపించలేదా అని తిరుపతి జనసేన నాయకులు సి. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే కరోనా కేసులు మన రాష్ట్రంలో ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతుంటే ఇక్కడ ప్రజలకూ బెడ్ లు గాని, మందులు గానీ,ఇంజెక్షన్స్ గానీ దొరకగా నానా యాతన పడి రోడ్లపైన, ఆస్పత్రుల ముందర పడి అనాధలుగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మీరు రోమన్ దేశము తగలబడుతుంటే రోమను చక్రవర్తి ఫిడేలు వస్తున్నట్టు, మీరు ఇప్పుడు ఈ బాధలన్నీ మీకు పట్టనట్టు,  మీరు మంత్రివర్గ సమావేశం పరచి ఆకలి లేని వారికి అన్నం పెట్టినట్లు ఎవరి కానీ ఇప్పుడు మాకు జీతాలు పెంచండి అని అడగడం లేదు. మీరు అది గమనించకుండా మీ ఓట్ల రాజకీయం కొరకు పాస్టర్స్ కు, అర్చకులకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా…   కరోనాకాలంలో బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించకార్యక్రమం ఏదో తలపెట్టగలరని చాలా సంతోషపడ్డారు.  మీరేమో ఈ కరోనా  కాలంలో కూడా మీ నిర్ణయాలు అతిశయోక్తి గా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలారా మనము ఇంకా ఈ గవర్నమెంట్ నమ్ముకో వలసిన పనిలేదు ఎవరు జాగ్రత్త వారు తీసుకుంటూ మాస్కులు తప్పనిసరిగా, శానిటైజర్ వాడుతూ, మనిషికి మనిషికి దూరం ఆరడుగుల దూరము ఉండేటట్లు జాగ్రత్త తీసుకుని మన ప్రాణాలను మనమే కాపాడుకొనుట చాలా ముఖ్యమని అన్నారు.