Logo
Date of Publish : 08 July 2022, 2:51 pm
Editor : Sake Naresh

సిప్లాన్ ఫ్యాక్టరీ మూయించాలని సంతకాల సేకరణ చేపట్టిన రాప్తాడు జనసైనికులు

           రాప్తాడు ( జనస్వరం ) : అనంతపురం రూరల్ మండలం, రాచనపల్లి గ్రామంలో ఉన్న సిఫ్లాన్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రాచనపల్లి గ్రామ ప్రజలతో సంతకాలను సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా మాకు ఆ ఫ్యాక్టరీ వద్దని, దాని వల్ల మా గ్రామం మరియు చుట్టూ పక్క ఉన్న గ్రామాల ప్రజలు నాశనం అవుతున్నారని స్థానిక ప్రజలు అన్నారు. అలాగే భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండడం లేదని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని, నాయకులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదన్నారు. ఫ్యాక్టరీ వల్ల ప్రజలు, రైతులు, మూగజీవాలు దెబ్బ తింటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి కొడిమి నారాయణ స్వామి, కార్యనిర్వాహక సభ్యుడు మధు, రాచనపల్లి వెంకటేష్, మరియు రాయల్ నరేష్, సదాశివ, ముస్తఫా, రామకృష్ణ, నజీమ్, పృద్వి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com