ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా

ప్రభుత్వం

        శ్రీకాళహస్తి ( జనస్వరం ) : 3 వ రోజు “జనసేన విజయ యాత్ర – AP NEEDS PAWAN KALYAN” కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి  వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం కొండమిట్ట కాలనీలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరిస్తూ, ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసాన్ని, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. నిత్యావసర ధరలు పెంపు, త్రాగు నీరు, డ్రైనేజ్ కాలువల సమస్యను ప్రజలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, రవి కుమార్ రెడ్డి, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, వీర మహిళలు దేవి, బతెమ్మ, శారద, సకుంతలమ్మ, రేవతి , జయంతి , రాజలక్ష్మి , నాయకులు దినేష్, గురవయ్య, రాజేష్, గిరీష్, శ్రీరామ్ , జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way