విజయనగరం, (జనస్వరం) : అర్హులైన పేదల అందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రీవిన్స్ లో కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకమారి గారికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా యశస్వి గారు మాట్లాడుతూ విజయనగరం మండలం, దుప్పాడ గ్రామంలో కొంతమంది నిరుపేదలను గుర్తించడం జరిగిందని, వారెవ్వరికీ పెన్షన్లు రావట్లేదని, ఇస్తున్న వారికి కూడా కొందరికి పెన్షన్లు ఆపివేశారని వీరందరికీ విచారణ జరిపించి, పెన్షన్లు వచ్చే విధంగా చేయాలని కోరామని, అలాగే కలెక్టరేట్ ముందు సుమారు పదిహేను రోజులనుంచి దీక్ష చేపడుతున్న అర్హులైన దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో జనసేన చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కాటం అశ్వని గారు, జనసేన నాయకులు రవితేజ, చందు, కిలారి ప్రసాద్, చరణ్, పవన్, శంకర్, మరియు దుప్పాడ గ్రామస్తులు తదితురులు పాల్గొన్నారు.