Search
Close this search box.
Search
Close this search box.

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న జనసైనికుడికి ఆర్ధిక సాయం అందించిన పెందుర్తి జనసేన నాయకులు

        పెందుర్తి, (జనస్వరం) : నరవ గ్రామం, 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గం, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు 60వ జన్మదిన సందర్భంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో క్యాన్సర్ తో బాధపడుతున్న గవర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి మీకు ఎల్లవేళలా జనసేన పార్టీ అండగా ఉంటుందని మనోధర్యం ఇవ్వడంతోపాటు 10 వేలు రూపాయలు ఆర్థిక భరోసా నరవ జనసేన పార్టీ తరపున ఇవ్వడం జరిగింది. నరవ జనసేన ప్రతినిధులు మాట్లాడుతూ యవ్వనంలో ఇటువంటి వ్యాధి సోకడం చాలా బాధాకరమని, కుటుంబ సభ్యులు ఇప్పటివరకు వైద్యం కోసం చాలా ఖర్చు పెట్టారు, కావున ట్రస్ట్ సభ్యులు, సంఘాలు, ఏ ఇతర వ్యక్తులైన స్పందించి సరియైన వైద్యం కోసం ఈ యొక్క కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గల్ల శ్రీనివాస్, వబ్బిన జనార్దన శ్రీకాంత్, రాడి పెంటరావు, ఓమ్మి అప్పలరాజు, గవర రాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way