Search
Close this search box.
Search
Close this search box.

తండ్యాం గ్రామాలలో పేడాడ రామ్మోహన్ రావు పర్యటన

పేడాడ రామ్మోహన్

     ఆముదాలవలాస ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం లో జాడ పేట మరియు తండ్యాం గ్రామాలలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పేడాడ రామ్మోహన్ రావు గారు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ముఖ్యంగా విద్యుత్ సమస్యలతో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని, రోడ్లు మరమ్మత్తులు లేక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమవడంతో ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్యాం గ్రామంలో SC కాలనీలో చాలా మందికి పక్కా ఇళ్లు మంజూరు కాకపోవడంతో వర్షాకాలంలో ఉండడానికి అవకాశం లేక ప్రభుత్వం పైన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ వైఫల్యం వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను మానవతా దృక్పథంతో జనసేనపార్టీ ఆధ్వర్యంలో, పరిష్కారం కోసం కృషి చేస్తానని రామ్మోహనరావు గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొందూరు మండల నాయకులు చిన్నం నాయుడు, రమణ, సూర్య, బాబూరావు, బాలు, చిన్న, సంతోష్, రాజు, మధు మరియు పెద్ధ సంఖ్యలో గ్రామ జనసేన కార్యకర్త లు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way