పొందూరులో అగ్ని ప్రమాదం, ఆదుకున్న జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్
శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం, పొందూరులో నిన్న అగ్ని ప్రమాధం జరిగి రెండు పూరిల్లు దగ్దం అయ్యాయి. విషయం తెలుసుకున్న ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ గారు భాదిత కుటుంబాలని పరామర్శించి నిత్యావసర సరుకులు బియ్యం ఇవ్వడము జరిగింది. బాధితులని సత్వరమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారికి ఏం అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.