బి.కె పల్లిలో త్రాగునీరు, కాలువలు, రోడ్ల కోసం శాంతియుత నిరసన

బి.కె పల్లి

        మదనపల్లి ( జనస్వరం ) : బికేపల్లి లో కనీసం మూలిక సదుపాయాలైనటువంటి తాగునీరు మురుగునీటి కాలువలు రోడ్లు 20 రోజుల్లోపు పనులు ప్రారంభించక పోతే నిరసన దీక్షలకు దిగుతాం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మై ఫోర్స్ మహేష్ అన్నారు. గత 75 రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ప్రజల సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా మేము ప్రారంభించినటువంటి జనం కోసమే జనసేన పాదయాత్రలో భాగంగా గత తొమ్మిది రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలోని బికేపల్లిలో పర్యటించారు. ఏ ఇంటికి వెళ్లిన ప్రతి ఇంటి ముందు మురుగునీటి కాలువ,లు ఏ ఇంటికి తాగునీరు వ్యవస్థ లేదు రోడ్డు వ్యవస్థలు లేవు. కనీసం వీధిదీపాలు లేని పరిస్థితి ప్రజలు కష్టాలు చూసి చాలించి  డీకేపల్లి వాసులతో కలిసి ఉదయం సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నా చేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి బీజేపల్లి సమస్యలపై వినతిపత్రం అందజేసి 20 రోజులు లోగా పనులు ప్రారంభించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపడతామని తెలియజేయడం జరిగింది. కావున బీకేపల్లిలో ప్రతి ఇంటికి తాగునీరు వ్యవస్థ, మురుగునీటి కాలువలు, రోడ్లు పనులు త్వరగా ప్రారంభించాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీకేపల్లి వాసులు, జనసేన పార్టీ నాయకులు అప్సర్, శమీ, రమణ, జాఫర్, అయ్యా అయ్యాజ్, జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు మల్లిక, శోభా, సునీత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way