ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం జనసైనికుల శాంతియుత దీక్ష

ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం జనసైనికుల శాంతియుత దీక్ష

            అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలోని గాంధీ విగ్రహం దగ్గర ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ రెండవ రోజు దీక్ష కొనసాగించారు. తమ సమస్యల పరిష్కారం కోసం గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగిస్తాం అని ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ తెలియజేశారు. కరోనా దెబ్బతో స్కూల్స్ తెరవకపోవడంతో ప్రయివేటు టీచర్స్, లెక్చరర్లు జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంజిత్ కుమార్ మడమల, సూదాని నందగోపాల్, సోమరౌతు నాంచారయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు గా ప్రయివేటు టీచర్స్ లెక్చరర్ యూనియన్ స్టేట్ సెక్రటరీ భట్టు శ్యామ్ ప్రసాద్, పి.టి.ఎల్.యూ కృష్ణా ప్రెసిడెంట్ అయ్యప్ప స్వామి, జాన్సన్ జయకుమార్‌, టి.ఉదయ్ కుమార్, జె.సూదా కిరణ్పా, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.