ఆత్మకూరు ( జనస్వరం ) : జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో మొదలుపెట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం లో రెండవ రోజుకు చేరుకుంది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు శాంతినగర్ కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది. రోడ్లు, డ్రైనేజీ మరియు మంచి నీళ్ళు మొదలగు ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మనసున్న పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజల సమస్యలన్నీ తీర్చగల శక్తి ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉన్నదని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, సురేష్, అనిల్ రాయల్, నాగరాజా తదితరులు పాల్గొన్నారు.