Logo
Date of Publish : 07 August 2022, 4:15 pm
Editor : Sake Naresh

సూళ్లూరుపేట నియోజకవర్గంలో గడప గడపకి పవనన్న ప్రజాబాట

    సూళ్లూరుపేట, (జనస్వరం) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో 4వ రోజు ఓజిలి మండలం బండారుగుంట అగ్రహారం, పల్లెంపడు గ్రామాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంజని పుత్రుని ఆశీర్వాదంతో, జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తుల సహకారంతో పవనన్న ప్రజాబాట అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకుంటే మన సమస్యలు తీరుతాయని కరపత్రాలు పంచి గ్రామస్తులని కోరడం జరిగింది. మార్పు కోరుకుంటన్న గ్రామస్తులు పవనన్నతోనే ఆ మార్పు సాధ్యమని నమ్ముతున్నారు. పల్లెంపడు చెరువులో చేపలు పెంపకం కొరకు రసాయనాలు కలపడం వలన చుట్టుపక్కల భూగర్భ జలాలు కలిషితమయ్యి త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఉయ్యాల ప్రవీణ్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓజిలి మండలాధ్యక్షుడు యర్రమాక గోపి, ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురుప్రసాద్, పుచ్చకాట్ల ప్రశాంత్ యాదవ్, గురుకుమార్, నవీన్, ప్రసాద్, అశోక్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com