దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతున్న పవనన్న ప్రజా బాట

పవనన్న ప్రజా బాట

     విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన పరిధి మేరకు కృషి చేస్తానని నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఆయన 39 వ వార్డు ఫెర్రీ వీధిలో పుష్పవతి అయిన కవలలో మొదట అమ్మాయి లక్ష్మి కి పట్టు బట్టలు వెండి పట్టీలు అందజేశారు. అలాగే ఆ ప్రాంతంలో పర్యటించి పలువురు దివ్యాంగులను కలుసుకున్నారు. వారికి వీల్ చైర్ లను త్వరలో అందజేస్తానని హామీ ఇచ్చారు. మరి కొద్ది రోజులలో మళ్ళీ ఆ ప్రాంతంలో పర్యటించి దివ్యాంగులకు తప్పకుండా వీల్ చేయగలను అందజేయునునట్లు ఆయన వెల్లడించారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉండేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే వ్యక్తిగత సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తాను చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అన్ని విధాలుగా జనసేన నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటున్నారని చెప్పారు. రెండు మూడు రోజులలో ఫెర్రీ వీధులను దివ్యాంగులకు వీల్ చైర్లను అందించనున్నట్లు మరోసారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way