Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారికి “పాలాభిషేకం” చేయవలసిన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

పవన్ కళ్యాణ్

           కళ్యాణదుర్గం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వాలంటీర్లు చేపట్టిన నిరసనలను తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో టీ సర్కిల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి “పాలాభిషేకం” చేయవలసిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేయడం జరిగింది. ఈ చర్యను జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి ప్రతిపక్షాలను అణిచివేయటం దుర్మార్గమైన హేమమైన చర్య అని హెచ్చరించారు… ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ గారు, జిల్లా సెక్రెటరీ లక్ష్మీ నరసయ్య గారు, జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ గారు, 5 మండలాల అధ్యక్షులు ఆంజనేయులు, జయకృష్ణ, చంద్రమౌళి, కాంత్ రాజ్, జాకీర్ మరియు కళ్యాణదుర్గం నాయకులు వీర మహిళ షేక్ తార, ముక్కన్న, రాయుడు, తిప్పెరుద్ర, మహేష్, గోవిందు, శివ రుద్ర, ధనంజయ, నరేష్, నితిన్ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way