పవన్ కళ్యాణ్ నామస్మరణ వైసీపీకి తారక మంత్రంలా ఉంది.

          అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలను సంధిస్తే సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రశ్నకు ఒకటే సమాధానం చెప్పడం ఏమిటి. డొంక తిరుగుడు వద్దు సీఎం.. సూటిగా సమాధానం చెప్పండి అంటే.. సామర్లకోటలో జరిగిన సభ లో సీఎం ఏదేదో మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే సరైన గుణపాఠం చెబుతామని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ ఘాటుగా హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ నామస్మరణ వైసిపికి తారకమంత్రంలా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక స్థాయి దిగజార్చుకొని వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. మేము కూడా స్థాయి తగ్గించుకొని మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వస్తే తల ఎక్కడ పెట్టుకుంటారో.. మీ నాన్న చనిపోయినప్పుడు కలకత్తాలో మీరు ఏం చేస్తున్నారో… బెంగళూరు ప్యాలెస్ లో మీరు ఏమి చేసేవారో.. మీ రాసలీల గురించి ఎవరికి తెలియదు అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. వీధి వీధిలో రచ్చబండల మీద మీ బండారం బయట పెట్టాల్సి వస్తుందన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న వ్యవస్థీకృత ప్రశ్నలకు అంతే హుందాగా సమాధానం చెబితే బాగుంటుంది. అంతకుమించి వ్యక్తిగత దూషణలకు దిగినా… రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరించిన జనసైనికులుగా ప్రతిఘటిస్తామని టి.సి.వరుణ్ పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way