కేశవరం జనసైనికులు ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కేశవరం జనసైనికుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు విచ్చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ గారు మాట్లాడుతూ కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వేడుకలను జరుపుకోవాలని సూచననిచ్చారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రంలో మండపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి శెట్టి రవి గారు, కేశవరం జనసేన నాయకులు ఉండమట్ల రామారావు గారు, ఉండమట్ల వీరేంద్ర గారు, చౌదళ్ల శివ గారు, గుడ్ల బాబీ గారు, గుగ్గిలం వెంకటేశ్వర్లు, పెడపాటి మణికంటేశ్వరావు, గురుమల్ల దుర్గా మణికంఠ, అంకం బుల్లినాయుడు, కూసు మణికంఠ, కూసు అచ్యుత్, ఉండమట్ల ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.