Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ జోలికొస్తే సహించం : నెల్లూరు జనసేన నాయకులు

– అమరావతి నుంచి విజయవాడకు హెలికాప్టర్లో వెళ్లే వ్యక్తి జగన్
– కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్
– జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు

      నెల్లూరు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి నుంచి విజయవాడకు హెలికాప్టర్లో వెళ్లే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఓ పక్క జి20 సదస్సు జరుగుతుందని, ఎన్నో కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటే.. ఈ విపత్కర పరిస్థితిని చూసి వారు భయభ్రాంతులతో వెనక్కి వెళ్ళిపోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన ప్రశ్నించారు. లండన్ లో ఆస్తులు కొనుగోలు చేసేందుకే సీఎం జగన్ వెళ్లారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను ఐదు నిమిషాలు నిర్బంధిస్తేనే ఆంధ్ర రాష్ట్రం అట్టుడికి పోయిందన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన కక్ష సాధింపు చర్యలో భాగంగా రాష్ట్రాన్ని గందరగోళ స్థితిలోకి తీసుకొచ్చారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way