Search
Close this search box.
Search
Close this search box.

మన బ్రతుకులు మార్చడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ : మర్రాపు సురేష్

మర్రాపు సురేష్

      విజయనగరం ( జనస్వరం ) : పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా పదిహేనువ రోజు మంగళవారం గజపతినగరం నియోజకవర్గం, ఓంపల్లి గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ పర్యటించారు. ప్రతీ ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలతో కూడియున్న కరపత్రాలను పంచుతూ ప్రజలందరికి అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ ప్రజలకు చేస్తున్న రైతు భరోసా సాయం, ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజావాణి కోసం మొదలగు సేవలను ప్రజలకు వివరించారు. ఓంపల్లి గ్రామస్తులు బొట్లు పెట్టి, హరతులతో జనసేన నాయకులకు నీరాజనాలు పలికారు. ఈ సందర్బంగా నాయకులు సురేష్ మాట్లాడుతూ మన బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్చడానికి వచ్చిన నిస్వార్థ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో ఈసారి నిజాయితీతో పార్టీ పెట్టిన జనసేన అభ్యార్థులకు వేసి గెలిపించిమని అభ్యర్థిస్తున్నామని, ఖచ్చితంగా రాష్ట్రంలో జెండా మారితే సామాన్యుల బతుకులు మారడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, మిడతాన రవికుమార్,పండు, శ్రీను, హరీష్ నానీ,చలం, లండ గౌరీ నాయుడు, రవీంద్ర, కె. తిరుపతి రావు, వాకాడ రమేష్, బాలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way