Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ సిఎం కావాలి – ప్రజల సమస్యలు తీరాలి : మైఫోర్స్ మహేష్

మైఫోర్స్ మహేష్

        మదనపల్లి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ ను సిఎం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, మదనపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తామని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ ప్రకటించారు. ఆదివారం మదనపల్లె రూరల్ మండలం బోడుమల్లదిన్నె లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మైఫోర్స్ మహేష్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మైఫోర్స్ మహేష్ ఆద్వర్యంలో మదనపల్లె నుండి బోడుమల్లదిన్నె వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని యువత, జనసేన పార్టీ నాయకులు మైఫోర్స్ మహేష్ కు ఘనంగా స్వాగతం పలికారు. ‌జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా జనసైనికులు పవన్ కళ్యాణ్ సిఎం కావాలని, మైఫోర్స్ మహేష్ ఎమ్మెల్యే కావాలంటూ నినాదాలు చేశారు. 60 రోజులు పాటు జనం కోసం జనసేన కార్యక్రమం మదనపల్లె నియోజకవర్గం నిర్వహించడం జరిగిందని వివరించారు. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ రాష్ట్రంలో విజయ డంకా‌ మ్రోగిస్తుందని, మదనపల్లెలో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తామని అన్నారు.‌ రాష్ట్రంలో జనసేన పార్టీకి ప్రజల నుండి గొప్ప ఆదరణ లభిస్తోందని, అత్యధికంగా ఎమ్మెల్యేలు గెలిచి పవన్ కళ్యాణ్ సిఎం కావడం తధ్యం అన్నారు.‌ అనంతరం ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ సిద్దాంతాలను తెలియజేసి రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు అమరనారాయణ, జనసేన నాయకులు సందీప్, శంకర్, మల్లిక, సుప్రజ, సునీత, నరేష్, మనోజ్, నాగేంద్ర, సోను, హర్ష, షబ్బీర్, సల్మాన్, షామీర్, చాన్, ఆయాజ్, జాఫర్, పాల్గొన్నారు. ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way