రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

           విజయనగరం ( జనస్వరం ) : అన్ని కులాలను కలుపుకొని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ పై అవాకులు, చవాకులు వాగుతుంటే సహించేది లేదని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు హెచ్చరించారు. దీనిపై శనివారం ఉదయం ఆయన కార్యాలయంలో మీడియాతో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదకాపులు,చినకాపులు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారయణ, ముద్రగడ పద్మనాభం కు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అక్రమాలు,దారుణాలు, అన్యాయాలు తెలియ లేదా అని ప్రశ్నించారు. కేవలం ఉద్యమం పేరుతో మీరు సాధించింది శూన్యమని, జగన్ వద్ద మెప్పు కోసం, పదవులకోసం, పవన్ కళ్యాణ్ ను లక్షంగా చేసుకొని నోటికి వచ్చినట్లు వాగుతున్నారని, ఇటువంటి చులకన రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. మరో సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు) మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టగానే వైఎస్సార్సీపీ నాయకులు పేర్ని నాని, బొత్స సత్యనారయణ, ముద్రగడ పద్మనాభం వంటి చాలా మంది పవన్ కళ్యాణ్ పై దుర్భాషులాడుతూ విరుచుకు పడుతున్నారని, బొత్స సత్యనారయణ ఐతే ఏకంగా పవన్ కళ్యాణ్ గూండా అని, జనసైనుకులు రౌడీలు అని నోటికి వచ్చినట్లు పేలుతున్నారని, ఆ మాటలను జనసేన తరుపున ఖండిస్తూ, ఆ మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటీని మరచి, ప్రజా పాలనను ఏకంగా మరుగున పడేసారని అన్నారు. ఈ వైసీపి నాయకులు ప్రజల సంక్షేమం కోసం కాకుండా ఒక్క ఎమ్మెల్యే, ఎంపి లేని జనసేన పార్టీ ను చూసి ఇలా వాగుతున్నారంటే.. కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు, పార్టీకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఈ వైసీపీ నాయకులకు తగిన విధంగా గుణపాఠం, సమాధానం దొరుకుతుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way